Monday 7 October 2013

ఆత్మగౌరవం కోసమే యాత్ర. టిడిపి నేత అనురాధ

తెలుగుజాతి ఆత్మగౌరవం కోసమే తమ పార్టీ అధినేత యాత్ర చేపడుతున్నారని చర్చలో పాల్గొన్న టిడిపి మహిళా నేత అనురాధ అన్నారు. చంద్రబాబుకు యాత్రలు కొత్త కాదని చెప్పారు. తెలుగు ప్రజల గోడు తెలుసుకునేందుకు, వాస్తవ పరిస్ధితులు వారికి వివరించేందుకు బాబు యాత్ర చేపడుతున్నారని పేర్కొన్నారు. అయితే కొత్త రాజధాని ఏర్పాటుకు 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని మాత్రమే తమ నేత చెప్పాడని అన్నారు. కాంగ్రెస్, వైసిపిలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించే తమ పార్టీ 2008 లో లేఖ రాసిందని చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీని భూస్ధాపితం చేయాలనే రాజకీయ పన్నాగంతోనే కాంగ్రెస్, వైసిపిలు కుమ్మక్కై తమ పార్టీపై లేనిపోని అభాంఢాలు వేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో డీల్ కుదుర్చుకునేందుకే వైసిపి బృందం ఢిల్లీ పర్యటను వెళ్లిందని ఆరోపించారు. -

No comments:

Post a Comment